హిమాచల్ ప్రదేశ్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే

Updated on: Sep 09, 2025 | 6:30 PM

ప్రధాని మోడీ ఇటీవల వరదలతో తీవ్రంగా ప్రభావితమైన హిమాచల్ ప్రదేశ్ ను సందర్శించి, ఏరియల్ సర్వే నిర్వహించారు. కాంగ్రాలో రాష్ట్ర అధికారులతో సమీక్షించి, వరద బాధితులతో మాట్లాడారు. ఆ తర్వాత పంజాబ్ లోని వరద ప్రభావిత ప్రాంతాలను కూడా సందర్శించనున్నారు. ఈ పర్యటన వలన వరద బాధితులకు త్వరితగతిన సహాయం అందే అవకాశం ఉంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల భారీ వర్షాలు మరియు వరదలతో విధ్వంసం చెందిన హిమాచల్ ప్రదేశ్‌ను సందర్శించారు. తొలుత, ప్రధాని మోడీ కొండచెరవులు విరిగిపడిన ప్రాంతాలపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత, కాంగ్రాలో రాష్ట్ర అధికారులతో సమావేశమై వరదల వల్ల కలిగిన నష్టం గురించి సమీక్షించారు. వరద నష్టాలకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను కూడా పరిశీలించారు. వరద బాధితులతో, NDRF, SDRF, ఆర్మీ మరియు ఇతర సహాయక బృందాలతో ప్రధాని మోడీ సంభాషించారు. ఈ సమావేశంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ మరియు గవర్నర్ శివు ప్రతాప్ శుక్లా కూడా పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ పర్యటన అనంతరం, ప్రధాని మోడీ పంజాబ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అవి క్షుద్రపూజలు కాదు.. ఆ ఒక్క తప్పే మేం చేసింది

కులమతాలకు అతీతంగా తురకపాలెంలో పూజలకు నిర్ణయం

Gold Price: ఆకాశమే హద్దుగా.. బంగారం ధర

4 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం.. దంచికొట్టనున్న వర్షాలు

బిడ్డ‌ను ఫ్రీజర్ లో పెట్టి మ‌రిచిపోయిన త‌ల్లి.. చివరకు