ఆన్ లైన్ గేమింగ్ కు నిండు ప్రాణం బలి

Updated on: Dec 27, 2025 | 10:18 PM

మేడ్చల్ జిల్లాలో ఆన్‌లైన్ గేమ్స్‌లో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోయిన రవీందర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మోసపోయానని గ్రహించి తీవ్ర మనస్తాపంతో ఉరి వేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని, ఆన్‌లైన్ జూదమే దీనికి కారణమని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఈ ఘటన ఆన్‌లైన్ గేమింగ్ ప్రమాదాలపై తీవ్ర చర్చను రేకెత్తించింది.

ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనం మరో యువకుడి ప్రాణాన్ని బలిగొంది. మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో రవీందర్ అనే వ్యక్తి ఆన్‌లైన్ గేమ్స్‌లో భారీగా డబ్బులు పెట్టుబడిగా పెట్టి తీవ్రంగా నష్టపోయాడు. మోసపోయానని తెలుసుకున్న తర్వాత తీవ్ర మనస్తాపానికి గురై తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని, ఆన్‌లైన్‌లో జూదం ఆడటమే తాను చేసిన పెద్ద తప్పని రవీందర్ ఆత్మహత్యకు ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. “నా చావుకి నేనే కారణం. అందరికీ నేను ఇదే చెప్తున్నా. నేను చేసిన పెద్ద తప్పు ఏందంటే ఆన్‌లైన్‌లో జూదం ఆడడం. దాని వల్ల నేను చనిపోవడం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

Gold Price Today: ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. శనివారం తులం ఎంతంటే..

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ… కడలిలో కలిసిన 10 వేల అభాగ్యులు

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే

వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట