Andhra: డబ్బుల బ్యాగు స్కూటీలో పెట్టుకుని బయల్దేరాడు.. కొంతదూరం వెళ్లాక
లక్ష రూపాయల సొత్తు.. తన స్కూటీ డిక్కీలో పెట్టుకుని బయల్దేరాడు ఓ వ్యక్తి. కొంతదూరం వెళ్లాక ఆకలేసి ఓ హోటల్ దగ్గర ఆగాడు. అక్కడ టిఫిన్ చేస్తుండగా ఊహించని సీన్ ఎదురైంది. స్కూటీ దగ్గరకు వెళ్లగానే.. డిక్కీలోని డబ్బు కనిపించలేదు. ఆ తర్వాత ఏమైంది..
కృష్ణాజిల్లా ఉయ్యూరులో పట్టపగలు భారీ దొంగతనం జరిగింది. స్థానిక పెద్ద మార్కెట్ వద్ద ఓ వ్యక్తి స్కూటీలో ఉంచిన నగదును చోరీ చేశారు దుండగులు. వివరాల్లోకి వెళ్తే.. ఉయ్యూరుకు చెందిన మణి అనే వ్యక్తి తన స్కూటీ డిక్కీలో రూ. 1.50 లక్షల క్యాష్ ఉంచి హోటల్లో టిఫిన్ చేస్తుండగా.. అనూహ్యంగా చోరీ చేశాడు ఓ దుండగుడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ దొంగతనం సీసీ టీవీలో రికార్డు కావడంతో.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published on: May 03, 2025 04:03 PM
Follow Us
వైరల్ వీడియోలు
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు
కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు
పైకి.. కిట్ కాట్ చాక్లెట్ ప్యాకెట్.. ఓపెన్ చేస్తే..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
ప్రపంచంలోనే ధనిక గ్రామం.. భారత్లోనే...!
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం!
ఇందూరు నయాగర జలపాతం ఎప్పుడైనా చూశారా?

