AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: డబ్బుల బ్యాగు స్కూటీలో పెట్టుకుని బయల్దేరాడు.. కొంతదూరం వెళ్లాక

Andhra: డబ్బుల బ్యాగు స్కూటీలో పెట్టుకుని బయల్దేరాడు.. కొంతదూరం వెళ్లాక

Ravi Kiran

|

Updated on: May 03, 2025 | 4:04 PM

లక్ష రూపాయల సొత్తు.. తన స్కూటీ డిక్కీలో పెట్టుకుని బయల్దేరాడు ఓ వ్యక్తి. కొంతదూరం వెళ్లాక ఆకలేసి ఓ హోటల్ దగ్గర ఆగాడు. అక్కడ టిఫిన్ చేస్తుండగా ఊహించని సీన్ ఎదురైంది. స్కూటీ దగ్గరకు వెళ్లగానే.. డిక్కీలోని డబ్బు కనిపించలేదు. ఆ తర్వాత ఏమైంది..

కృష్ణాజిల్లా ఉయ్యూరులో పట్టపగలు భారీ దొంగతనం జరిగింది. స్థానిక పెద్ద మార్కెట్ వద్ద ఓ వ్యక్తి స్కూటీలో ఉంచిన నగదును చోరీ చేశారు దుండగులు. వివరాల్లోకి వెళ్తే.. ఉయ్యూరుకు చెందిన మణి అనే వ్యక్తి తన స్కూటీ డిక్కీలో రూ. 1.50 లక్షల క్యాష్ ఉంచి హోటల్‌లో టిఫిన్ చేస్తుండగా.. అనూహ్యంగా చోరీ చేశాడు ఓ దుండగుడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ దొంగతనం సీసీ టీవీలో రికార్డు కావడంతో.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published on: May 03, 2025 04:03 PM