Malla Reddy: తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు కారణం ఇదే: మంత్రి మల్లారెడ్డి

రైతు ఆత్మహత్యలపై మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాకమునుపు రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండేవాళ్లన్నారు. దీనికి కారణం.. సరైన కరెంట్ లేక, సమయానికి నీళ్లు రాక, ఎరువులు దొరకక, పండిన పంటకు గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండే వాళ్లని రైతుల కష్టాలను వివరించారు. తెలంగాణ వచ్చాక భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో పంట అంటే పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్‌లు అన్నపూర్ణలుగా ఉండేవని గతాన్ని గుర్తు చేశారు.

Malla Reddy: తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు కారణం ఇదే: మంత్రి మల్లారెడ్డి
Minister Mallareddy give reasons for farmers' suicides in Telangana

Updated on: Nov 23, 2023 | 8:29 PM

రైతు ఆత్మహత్యలపై మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాకమునుపు రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండేవాళ్లన్నారు. దీనికి కారణం.. సరైన కరెంట్ లేక, సమయానికి నీళ్లు రాక, ఎరువులు దొరకక, పండిన పంటకు గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండే వాళ్లని రైతుల కష్టాలను వివరించారు. తెలంగాణ వచ్చాక భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో పంట అంటే పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్‌లు అన్నపూర్ణలుగా ఉండేవని గతాన్ని గుర్తు చేశారు.

కానీ ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు బంద్ చేసి.. వాళ్లకు భరోసా కల్పించి, 24గంటల కరెంట్ ఇచ్చి, సాగునీరుతో పాటూ సకాలంలో ఎరువులు అందించి రైతులను ఆదుకుంటున్నామన్నారు. అందుకే ఈరోజు కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వందే అని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా వడ్లే వడ్లు అంటూ తమ పాలన గురించి గొప్పగా చెప్పుకొచ్చారు మంత్రి మల్లారెడ్డి.

మల్లారెడ్డి పూర్తి వీడియో..

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..