Isha Yoga Center: ఈశా యోగా సెంటర్‌లో శివరాత్రి వేడుకలు.. లైవ్ చూడండి…

Updated on: Mar 08, 2024 | 8:09 PM

తమిళనాడులో ఈశా యోగా సెంటర్‌లో ఎంతో నియమ నిష్ఠలతో శివరాత్రిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదియోగి విగ్రహం వద్ద భారీ వేదిక ఏర్పాటు చేశారు. మహా శివుడి పాటలతో తన్మయత్వంతో మునిగిపోతున్నారు భక్తులు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల ప్రత్యక్ష ప్రసారం చూద్దాం..

మహా శివరాత్రి సందర్భంగా.. తమిళనాడులోని ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎంతో మంది సెలబ్రిటీలు, భక్తులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఒక ఎత్తైతే.. ఈశా యోగా సెంటర్‌లో జరిగే వేడుకలు నెక్ట్స్ లెవల్.  శంభో శంకర అంటూ భక్తులు ముక్కంటిని వేడుకుంటున్నారు. వివిధ దేశాల నుంచి శివ భక్తులు ఇక్కడికి వచ్చారు. మహా శివుడి పాటలతో తన్మయత్వంతో మునిగిపోతున్నారు భక్తులు. అక్కడి నుంచి లైవ్ చూద్దాం.

Published on: Mar 08, 2024 08:01 PM