Tirumala: శ్రీవారి సేవలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే
ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకున్న మహారాష్ట్ర సీఎం.. రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు. శుక్రవారం ఉదయం అభిషేక సేవ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం షిండే దంపతులకు రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనం చేసి.. శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసారు పండితులు.
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు. గురవారం రాత్రి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకున్న మహారాష్ట్ర సీఎం.. రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు. శుక్రవారం ఉదయం అభిషేక సేవ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం షిండే దంపతులకు రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనం చేసి.. శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసారు టీటీడీ అధికారులు. అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు షిండే కుటుంబ సభ్యులు. సీఎం షిండే వెంట మహారాష్ట్రకు చెందిన టీటీడీ పాలక మండలి సభ్యులు సౌరభ్ భోరా, మిలింద్ నర్వేకర్ ఉన్నారు. వారే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం షిండే తిరుమల నుంచి ముంబైకి తిరిగి వెళ్లారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Published on: Nov 10, 2023 09:42 AM