AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: డైవరన్న జర ఆగాల్సింది.. వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. కొంచెం అయితే..

Andhra: డైవరన్న జర ఆగాల్సింది.. వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. కొంచెం అయితే..

Shaik Madar Saheb
|

Updated on: Sep 11, 2025 | 11:12 AM

Share

మంత్రాలయం సమీపంలో వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది..  రోడ్డుపై నీళ్లు తక్కువే ఉన్నాయని డ్రైవర్‌ బస్సును పోనిచ్చాడు.. ఈ క్రమంలో బురద కారణంగా ఆర్టీసీ బస్సు మధ్యలో ఇరుక్కుపోయింది.  దరువంపు వాగు ఉధృతి కారణంగా నాగలదిన్నె, కర్నూలు, ఐజ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలులో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.. ఈ క్రమంలో.. మంత్రాలయంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీవర్షాలకు దరువంపు వాగు ఉప్పొంగింది.. దీంతో మంత్రాలయం సమీపంలో వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది..  రోడ్డుపై నీళ్లు తక్కువే ఉన్నాయని డ్రైవర్‌ బస్సును పోనిచ్చాడు.. ఈ క్రమంలో బురద కారణంగా ఆర్టీసీ బస్సు మధ్యలో ఇరుక్కుపోయింది.  దరువంపు వాగు ఉధృతి కారణంగా నాగలదిన్నె, కర్నూలు, ఐజ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నల్ల వాగులో కూడా ప్రవాహం బాగా పెరిగింది.  ఉదయాన్నే ఈ ఆర్టీసీ బస్సు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల కోసం వెళ్తుంది. ఈ క్రమంలో వరద కారణంగా బస్సు ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్, మరో ప్రయాణీకుడు తృటిలో ప్రాణపాయం నుంచి బయట పడ్డారు. విద్యార్థులు బస్సులో లేరని.. తృటిలో ప్రాణాపాయం తప్పిందని స్థానికులు తెలిపారు. ఇలాంటి సమయంలో అప్రమత్తత అవసరం అని పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి..

Rain Alert: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

Published on: Sep 11, 2025 11:12 AM
Follow Us