Tirupati Rain: తిరుపతిలో అర్ధరాత్రి వర్ష బీభత్సం.. నీళ్లలో నిల్చిపోయిన వాహనం ఊపిరాడక యువతి మృతి..(వీడియో)

|

Oct 28, 2021 | 6:38 PM

రాయలసీమ వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో తిరుపతిలో అర్ధరాత్రి భారీవర్షం భీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి వెస్ట్ చర్చి వద్ద నీటి ప్రవాహం పెరిగింది. ఈ వరదలో వాహనం ఇరుక్కుపోయింది.


రాయలసీమ వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో తిరుపతిలో అర్ధరాత్రి భారీవర్షం భీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి వెస్ట్ చర్చి వద్ద నీటి ప్రవాహం పెరిగింది. ఈ వరదలో వాహనం ఇరుక్కుపోయింది. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీటి ఉధృతి పెరగడంతో కర్ణాటకకు చెందిన పెళ్ళిబృందం ప్రయాణిస్తున్న వాహనం నీళ్లలోనే నిలిచిపోయింది. దీంతో వాహనంలో ఊపిరాడక సంధ్య అనే యువతి మృతి చెందింది. నీటి ప్రవాహాన్ని గమనించకుండా ముందుకు వెళ్లిపోయిన వాహనం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. వాహనంలోని వారంతా కర్ణాటకలోని రాయచూరు కు చెందిన పెళ్లి బృందంగా గుర్తించారు. ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న ఏడుగురిలో సంధ్య అనే యువతి ఊపిరి ఆడక మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని రుయా ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Sudheer Babu-Sridevi Soda Center: ఓటీటీలో శ్రీదేవి సోడా సెంటర్.. తేదీ ఖరారు పై నిర్మాతల మాట.. (వీడియో)

Follow us on