పాత నోట్ల మార్పిడి వెనుక రాజకీయ నేతల హస్తం..?
కర్ణాటకలో రూ. 400 కోట్ల విలువైన పాత 2000 నోట్ల కంటైనర్ చోరీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సిట్ హవాలా ఆపరేటర్ విరాట్ గాంధీని అరెస్ట్ చేసింది. ఈ కేసులో హవాలా నెట్వర్క్లు, బిల్డర్లు, మత సంస్థలకు సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డబ్బును ఎన్నికల ఖర్చులకు వినియోగించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది, జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది.
కర్ణాటకలో 400 కోట్ల రూపాయల విలువైన పాత 2000 నోట్ల కంటైనర్ దొంగతనం కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఇంటర్స్టేట్ దోపిడీ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) విరాట్ గాంధీ అనే హవాలా ఆపరేటర్ను జనవరి 23న అరెస్ట్ చేసింది. రాజస్థాన్కు చెందిన విరాట్ గాంధీకి ఒక మత సంస్థతో సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేయగా, థానేకు చెందిన ప్రముఖ బిల్డర్ కిషోర్ సాబ్లా, అజార్ అనే మరో ఇద్దరు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: ఆ తప్పు రిపీట్ అవ్వదంటున్న అల్లు అర్జున్
ట్రెండ్ మారింది..స్పెషల్ సాంగ్ ట్రెండూ మారింది
చేజేతులా సినిమాలను నాశనం చేసుకుంటున్నారా
