భారత్కు భూకంపాల ముప్పు వీడియో
భూగర్భంలో భారత టెక్టోనిక్ ప్లేట్లు చీలిపోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రక్రియను డిలామినేషన్ అంటారు. దీనివల్ల టిబెట్ కింద భారత ప్లేట్ లోపలికి జారుతోంది. భవిష్యత్తులో హిమాలయ ప్రాంతాల్లో భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. హిమాలయాలు ఇంకా ఎత్తుకు ఎదుగుతుండటం గమనార్హం.
భూమి పైకి ప్రశాంతంగా కనిపించినప్పటికీ, దాని భూగర్భంలో నిరంతరం మార్పులు సంభవిస్తున్నాయి. సాధారణంగా భూమి కింద ఉండే టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొనడం వల్ల భూకంపాలు సంభవిస్తాయి. సముద్ర గర్భంలో ఇలాంటి ఘర్షణలు జరిగినప్పుడు సునామీలు ఏర్పడతాయి. తాజాగా, భారత టెక్టోనిక్ ప్లేట్లు చీలిపోతున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిని డిలామినేషన్ ప్రక్రియగా పేర్కొంటున్నారు. టిబెట్ పీఠభూమి కింద భారత ప్లేటు లోతుగా చీలిపోయి రెండు పొరలుగా విడిపోతోందని గుర్తించారు. భారత యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల ఘర్షణ కారణంగానే హిమాలయాలు ఏర్పడ్డాయని, టిబెట్ పీఠభూమి నిర్మాణం జరిగిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

