Watch Video: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో రెండేళ్ల బాలుడు కిడ్నాప్.. ఎలా ఎత్తుకెళ్లారో చూడండి..!
Tirupati, October 03: ఇటీవలి కాలంలో చిన్న పిల్లల కిడ్నాప్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా తిరుపతి ఆర్టీసీ బస్స్టాండ్లో రెండేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల నుంచి బాలుడు కనిపించడం లేదు. బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు అంతటా గాలించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Tirupati, October 03: ఇటీవలి కాలంలో చిన్న పిల్లల కిడ్నాప్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా తిరుపతి ఆర్టీసీ బస్స్టాండ్లో రెండేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల నుంచి బాలుడు కనిపించడం లేదు. బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు అంతటా గాలించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్స్టాండ్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతనే బాలుడిని తీసుకెళ్తున్నట్లు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా గుర్తించారు పోలీసులు. తమిళనాడుకు చెందిన కుటుంబం తమ కొడుకు అజేన్ మునుగన్తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే, అర్థరాత్రి 12 గంటలు కావడంతో బస్స్టాండ్లోనే నిద్రపోయారు. సరిగ్గా 2 గంటల సమయంలో బాలుడు కనిపించకుండా పోయాడు.
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

