అమెరికాలో కాల్పులు… హైదరాబాద్ విద్యార్థి మృతి వీడియో
అమెరికాలోని డాలస్లో తెలంగాణ విద్యార్థి పోలే చంద్రశేఖర్ కాల్పుల్లో మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన చంద్రశేఖర్, గ్యాస్ స్టేషన్లో పార్ట్టైమ్ చేస్తూండగా దుండగుడి కాల్పులకు బలయ్యాడు. ఈ ఘటనతో హైదరాబాద్లోని కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు ఇండియన్ ఎంబసీని కోరుతున్నారు.
అమెరికాలో దుండగుడి కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్, ఎల్బీనగర్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్కు చెందిన పోలే చంద్రశేఖర్ 2023లో బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్టోబర్ 4న తెల్లవారుజామున డాలస్లో జరిగిన కాల్పుల్లో చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో రాత్రి విధుల్లో ఉన్న సమయంలో ఒక నల్లజాతీయుడు ఆకస్మికంగా కాల్పులు జరపడంతో చంద్రశేఖర్ అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.
మరిన్ని వీడియోల కోసం :
