కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? పాలలో ఈ పొడి కలిపి తాగితే..

Updated on: Feb 21, 2025 | 6:01 PM

మునక్కాయలను ఇష్టపడని వారుండరు. ఎందుకంటే మునక్కాయలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతారు. మునగ కాయలే కాదు, మునగ ఆకుల్లో కూడా ఔషధగుణాలెన్నో ఉన్నాయంటున్నారు నిపుణులు. మునగ కాయలు, మునగ ఆకులతో వివిధ రకాల వంటలు చేస్తుంటారు చాలామంది. మునగ ఆకులో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని ఆయుర్వేద ఔషధాలలో ఎక్కువగా వినియోగిస్తుంటారు.

ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది. మునగ ఆకుల్లో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. అదనంగా ఇందులో ఫైబర్, విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మునగ ఆకులు పొడిచేసుకొని పాలలో కలిపి తాగడం వల్ల, పలు ఆరోగ్య సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మునగ ఆకులతో తయారు చేసిన పొడిని తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది, జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ముఖ్యంగా మునగ ఆకుల పొడిని పాలల్లో కలిపి తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలను బలోపేతం చేస్తాయి. ప్రతి రోజూ సాయంత్రం టీకి బదులుగా పాలలో మునగ పొడి కలిపి తాగడం వల్ల ఎముకలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి మునగపొడి మంచి ఆప్షన్‌ అని చెప్పవచ్చు. మునగపొడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు కూడా మునగ పొడిని తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పొడి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ పొడిని ప్రతి ఉదయం లేదా సాయంత్రం గోరువెచ్చని పాలు లేదా నీళ్లలో కలిపి తాగాలి. రోగనిరోధక శక్తిని పెంచడానికి మునగ పొడిని ఆహారంలో తీసుకోవచ్చు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జంతువులు రెండు కాళ్లతో నడిస్తే ఇలా ఉంటుందా..

ఒక్క హగ్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. కేవలం 20 సెకన్లలో