Petrol – Diesel: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. తగ్గిన పెట్రోల్, డీజీల్ ధరలు.!
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై రూ. 2 తగ్గిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి హర్జిత్ సింగ్ పూరి ఎక్స్ వేదికగా ప్రకటించారు. తగ్గించిన ఈ ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై రూ. 2 తగ్గిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి హర్జిత్ సింగ్ పూరి ఎక్స్ వేదికగా ప్రకటించారు. తగ్గించిన ఈ ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మొదటినుంచి చేపడుతోన్న చర్యలను వివరిస్తూ సుదీర్ఘంగా పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రి ట్వీట్ చేస్తూ.. కష్టకాలంలో ప్రపంచ దేశాలు చమురు ధరలను 50 నుంచి 72 శాతం పెంచాయని, భారత దేశంలో మాత్రం ధరలు పెరగకపోగా ఈ రెండేళ్లలో 4.65 శాతం తగ్గాయని తెలిపారు. గతంలో భారతీయుల అవసరాల కోసం చమురును కేవలం 27 దేశాల నుంచే కొనుగోలు చేసేవాళ్లమని, కానీ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఈ పరిధిని విస్తరించి 39 దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.