Ganesh Nimajjanam: జై బోలో గణేష్ మహారాజ్‌కి.. ట్యాంక్ బండ్ వద్ద కొనసాగుతున్న గణనాథుల నిమజ్జనం..

Updated on: Sep 07, 2025 | 10:25 AM

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. గ్రేటర్‌ వ్యాప్తంగా ఇప్పటివరకు 2లక్షల 65 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగింది. భక్తులతో కిక్కిరిశాయి ట్యాంక్ బండ్ పరిసరాలు. ట్యాంక్‌బండ్‌పై రెండోరోజు కూడా భారీగా రష్ కనిపిస్తుంది. NTR మార్గ్‌, నెక్లెస్‌రోడ్‌లో వినాయక నిమజ్జనానికి క్యూకట్టారు గణనాథులు.

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. గ్రేటర్‌ వ్యాప్తంగా ఇప్పటివరకు 2లక్షల 65 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగింది. భక్తులతో కిక్కిరిశాయి ట్యాంక్ బండ్ పరిసరాలు. ట్యాంక్‌బండ్‌పై రెండోరోజు కూడా భారీగా రష్ కనిపిస్తుంది. NTR మార్గ్‌, నెక్లెస్‌రోడ్‌లో వినాయక నిమజ్జనానికి క్యూకట్టారు గణనాథులు. వివిధ రూపాల్లో గణేష్‌లు ఆకట్టుకుంటున్నాయి. సండే కావడంతో నిమజ్జనాలు చూసేందుకు ఇవాళ కూడా భక్తులు వస్తున్నారు.

ఎంజె మార్కెట్, బషీర్‌బాగ్‌లో గణనాథుల వాహనాలు క్లియర్ అయ్యాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్‌ దగ్గర.. నెమ్మదిగా కదులుతున్నాయి గణేష్ విగ్రహాల వాహనాలు. మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది. ట్యాంక్ బండ్ చుట్టూ 40 క్రేన్ల ద్వారా గణేష్‌ నిమజ్జనం కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచి ఒక్కసారిగా గణేష్ ప్రతిమలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

ఖైరతాబాద్‌ జోన్‌లో అత్యధికంగా 65 వేల విగ్రహాల నిమజ్జనం జరిగిందని తెలుస్తుంది. కూకట్‌పల్లి జోన్‌లో 62 వేలు, శేరిలింగంపల్లి జోన్‌లో 41 వేల విగ్రహాలు, ఎల్‌బినగర్‌ జోన్‌లో 36వేలు, చార్మినార్‌ జోన్‌లో 22వేలు, సికింద్రాబాద్‌ జోన్‌లో 36 వేల విగ్రహాల నిమజ్జనం జరిగాయి.