వైరల్‌ అవుతున్న పిక్‌.. సీతారామమ్‌ సీక్వెల్‌ సాధ్యమేనా

Updated on: Jan 30, 2026 | 6:29 PM

సీతారామం సీక్వెల్ సిద్ధమవుతోందంటూ ఓ వైరల్ పిక్ నెట్టింట్లో చర్చకు దారితీసింది. దుల్కర్, మృణాల్ తో కూడిన ఈ ఫోటో సీక్వెల్ కోసమా లేక మరేదైనా సినిమా కోసమా అనే సందేహాలున్నాయి. అయితే, నటీనటులు, దర్శకుడు ప్రస్తుత ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, దుల్కర్ గతంలో సీక్వెల్ కు విముఖత చూపడంతో సీక్వెల్ సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది.

సీతారామం సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోందంటూ ఇటీవల నెట్టింట్లో ఓ పిక్ వైరల్ అయింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కలిసి ఉన్న ఈ ఫోటో సీతారామం సీక్వెల్ కోసం తీసిన ఫోటోషూట్ గా చాలామంది భావించారు. రామ్ మళ్లీ బతికొస్తే కథ ఎలా ఉంటుందనే ఊహాగానాలతో సినీ ప్రియులు చర్చలు మొదలుపెట్టారు. అయితే, ఈ సీక్వెల్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో విజయవంతమైన సీతారామం సినిమాకు సీక్వెల్ ను రహస్యంగా తీయాల్సిన అవసరం లేదని కొందరు వాదిస్తున్నారు. కనీసం ఐడియా దశ నుంచే దీన్ని బలంగా ప్రచారం చేస్తారని వారి అభిప్రాయం. సీతారామం లాంటి క్లాసిక్స్ ను మళ్లీ మళ్లీ తెరకెక్కించకూడదని, వాటిని అలాగే వదిలేయాలని గతంలో దుల్కర్ సల్మాన్ కూడా వ్యాఖ్యానించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Toxic: కన్‌ఫర్మ్ చేసిన యష్‌.. చెర్రీ కోసమే వెయిటింగ్‌

Sai Pallavi: కల్కి సీక్వెల్‌లో పల్లవి.. పాన్ ఇండియాకే ఫిక్సయ్యారా

Allu Arjun: స్టార్ట్ కాకముందే సందడి… ఐకాన్‌స్టార్‌తో లోకేష్‌ మేజిక్‌ గ్యారంటీ

TTD: టీటీడీ శ్రీవారి డాలర్లకు ఫుల్ డిమాండ్

కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్‌