మళ్లీ తెర మీదకు మల్టీస్టారర్ న్యూస్

Updated on: Feb 01, 2026 | 5:14 PM

కూలీ సినిమా విడుదల తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమాపై ప్రచారం మొదలైంది. మొదట లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని వార్తలొచ్చినా, ప్రాజెక్ట్ డయలమాలో పడింది. తాజాగా ఈ క్రేజీ మల్టీస్టారర్‌కు జైలర్ ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని కోలీవుడ్ సర్కిల్స్‌లో కొత్త చర్చ జరుగుతోంది.

కూలీ సినిమా విడుదలైన తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నారనే వార్తలు మొదలయ్యాయి. ఈ కాంబినేషన్ గురించి అధికారిక అప్‌డేట్ లేనప్పటికీ, రోజూ ఒక వార్త ఫిలిం నగర్‌లో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వెల్లడైంది. మొదట కూలీ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ మల్టీస్టారర్‌కు దర్శకత్వం వహించబోతున్నారని ప్రచారం జరిగింది. రజినీ, కమల్ ఇద్దరితోనూ గతంలో సినిమాలు తీసిన లోకేష్, ఈ ప్రాజెక్ట్‌ను కూడా డైరెక్ట్ చేస్తారని భావించారు. అయితే, లోకేష్ దర్శకత్వానికి కొంత విరామం ఇచ్చి నటనపై దృష్టి పెట్టడంతో ఈ ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడింది. ఈలోగా రజినీకాంత్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రకటించడంతో, మల్టీస్టారర్ ఇక లేనట్టేనని అభిమానులు భావించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AA 22: రాజమౌళిని ఫాలో అవుతున్న AA 22 టీమ్

Jai Bhim: మళ్లీ ట్రెండ్ అవుతున్న జై భీమ్.. సీక్వెల్ డిమాండ్

Varanasi: వారణాసి రిలీజ్ డేట్‌కు అనుకోని కష్టం..

Chiranjeevi: మామ దెబ్బకు.. అల్లుడి రికార్డ్‌ బద్దలు

కీర్తిపై పలువురి విమర్శలు.. పేర్లు రాసి ఛస్తానంటూ.. ఇన్ డైరెక్ట్ వార్నింగ్

Loading...
Unable to load recommendations.
Follow Us