త్రిష ఎక్స్ ఖాతాలో షాకింగ్ పోస్ట్ ! అసలు విషయం చెప్పిన హీరోయిన్

Updated on: Feb 13, 2025 | 6:50 PM

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది త్రిష. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. అయితే త్రిష త‌న ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో షేర్ అయిన కొన్ని పోస్టులు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఇక ఎక్కువగా సినిమా విశేషాలే షేర్ చేసే త్రిష.. ఆల్ ఆఫ్ సడెన్‌గా తన ట్విట్టర్ ఖాతాలో క్రిప్టో క‌రెన్సీ గురించి పోస్ట్ చేయడంతో అందరూ స్టన్ అయ్యారు. దీన్ని వైరల్ చేశారు. అయితే ఇది గమనించిన త్రిష.. వెంటనే అలర్ట్ అయ్యింది. తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని గ్రహించింది. దానిని వెంట‌నే ఇన్ స్టాగ్ర‌మ్ ద్వారా అభిమానుల‌కు తెలియజేసింది. తన ట్విట్టర్ హ్యాక్ అయిందని చెప్పిన త్రిష.. తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్‌ను అలెర్ట్ చేసింది. ఈ సమస్యను పరిష్కరించే వరకు తన నుంచి ఎలాంటి పోస్ట్ లు రావు.. ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. త్రిష సోష‌ల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ కావ‌డం ఇదేం మొదటిసారి కాదు. గతంలో`పెటా` కార్య‌క‌ర్త‌గా పని చేసిన క్రమంలో త్రిషకు సంబంధించిన సోషల్ మీడియాఖాతాలను కొందరు హ్యాక్ చేసారు. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. దీంతో ఈ విషయాన్ని నోటీస్ చేసిన త్రిష.. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ విషయాన్ని తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్‌కు తెలిసేలా చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiranjeevi: రాజకీయాల్లో రీ ఎంట్రీ పై.. చిరు సెన్సేషనల్ కామెంట్స్

రణభూమిని చీల్చుకుని పుట్టే నాయకుడు.. గూస్ బంప్స్‌ పుట్టిస్తోన్న VD టీజర్‌!

TOP 9 ET News: NTR క్రేజ్‌తో దందా..డబ్బు దండుకుంటున్న కేటుగాళ్లు

అయ్యో.. కొంపముంచిన సిబిల్‌ స్కోర్‌.. ఏం జరిగిందంటే

రోజూ గ్లాసుడు నీళ్లలో చిటికెడు కలిపి తాగండి శరీరంలో జరిగే మ్యాజిక్‌ చూడండి