పూరి జగన్నాథ్ నెక్ట్స్ మూవీ మీద ఇంట్రస్టింగ్ బజ్

Updated on: Mar 04, 2026 | 9:35 AM

పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా విజయం కీలకమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తదుపరి సూర్య, నందమూరి బాలకృష్ణలతో ప్రాజెక్టులపై చర్చలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బజ్ పూరి భవిష్యత్తుకు ఊతమిచ్చే అవకాశం ఉంది.

పూరి జగన్నాథ్ భవిష్యత్ ప్రాజెక్టులపై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతితో “స్లమ్ డాగ్” అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. చాలా కాలంగా ఒక మంచి తెలుగు సినిమా కోసం ఎదురుచూస్తున్న విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్‌కు కాల్షీట్లు ఇవ్వడంతో ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించడం గ్యారెంటీ అనే టాక్ ట్రేడ్ వర్గాల్లో కూడా మొదలైంది. ఈ బజ్‌ను అందిపుచ్చుకునే ప్రయత్నంలో పూరి జగన్నాథ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన నడిపిన్ నాయగన్ సూర్యను కలిసి ఒక కథను వివరించారని, సూర్య కూడా సానుకూలంగా స్పందించారని కోలీవుడ్ సమాచారం. గతంలో పూరి తన “బిజినెస్ మ్యాన్” స్క్రిప్ట్‌ను సూర్యకే మొదట చెప్పారని, ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ కుదిరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!

ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?

అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్

మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ

Follow Us