Kangana Ranaut: కంగనా చెంప చెళ్‌మనిపించిన కానిస్టేబుల్‌.. ఏం జరిగిందంటే.!

|

Jun 09, 2024 | 2:53 PM

ఢిల్లీకి వెళ్లేందుకు గురువారం చండీగఢ్‌ విమానాశ్రయానికి వచ్చిన బాలీవుడ్‌ నటి, మండీ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం మహిళా కానిస్టేబుల్‌ కుల్వీందర్‌ కౌర్‌ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఈ అనూహ్య ఘటనపై కంగనా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెక్‌ను పూర్తిచేసుకుని లోపలికి వెళ్తుంటే మహిళా కానిస్టేబుల్‌ హఠాత్తుగా ఎదురొచ్చి చెంప చెళ్లుమనిపించింది.

ఢిల్లీకి వెళ్లేందుకు గురువారం చండీగఢ్‌ విమానాశ్రయానికి వచ్చిన బాలీవుడ్‌ నటి, మండీ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం మహిళా కానిస్టేబుల్‌ కుల్వీందర్‌ కౌర్‌ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఈ అనూహ్య ఘటనపై కంగనా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెక్‌ను పూర్తిచేసుకుని లోపలికి వెళ్తుంటే మహిళా కానిస్టేబుల్‌ హఠాత్తుగా ఎదురొచ్చి చెంప చెళ్లుమనిపించింది. తర్వాత దూషించింది. ఎందుకని అడిగితే రైతులకు మద్దతుగా ఆ పని చేశానని చెప్పింది. పంజాబ్‌లో ఉగ్ర, హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి అని కంగనా అన్నారు. ఢిల్లీకి చేరుకున్నాక సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ను కలిసి జరిగింది వివరించినట్టు తెలిపారు.

చెంపదెబ్బ కొట్టాక అక్కడే కొద్దిసేపు ఉన్న కానిస్టేబుల్‌ అక్కడ వారితో.. నాలుగేళ్ల క్రితం వివాదాస్పద మూడు సాగు చట్టాలను రద్దుచేయాలంటూ ఆందోళన బాటపట్టిన వేలాది మంది రైతులను కించపరుస్తూ వ్యాఖ్యలు, పోస్ట్‌లు చేసినందుకే కంగనను కొట్టినట్టు క్లారిటీ ఇచ్చింది. ఆనాడు ఢిల్లీలో బైఠాయించిన మహిళా రైతులను చూపిస్తూ వీళ్లంతా కేవలం రూ.100 కోసం ధర్నాలో పాల్గొన్నారు అని కంగనా కించపరిచారని తెలిపింది. ఆనాడు ధర్నా చేస్తున్న వాళ్లలో తన తల్లి కూడా ఉన్నారని, తమది రైతు కుటుంబం అని, తన తండ్రి, అన్న కూడా రైతులేనని వివరించింది. వారిలాగా కంగనా రోడ్డుపై కూర్చొని ధర్నా చేయగలదా? అని ఆవేదన వ్యక్తం చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on