అభిమాని చేసిన పనికి నివ్వెరపోయిన సంజయ్ దత్

Updated on: Sep 08, 2025 | 7:48 PM

ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసే 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' కార్యక్రమానికి దిగ్గజ నటులు సంజయ్‌దత్‌, సునీల్‌శెట్టి అతిథులుగా హాజరయ్యారు. కపిల్‌ శర్మ కార్యక్రమం నవ్వుల పువ్వులు పూయిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అలా సరదాగా సాగుతున్న ఈ కార్యక్రమంలో ఓ అభిమాని చేసిన వ్యాఖ్యలతో అక్కడున్నవారంతా దెబ్బకు సైలెన్స్‌ అయిపోయారు.

ఆ తర్వాత అంతా ఒక్కసారిగా నవ్వేశారు. షోలో భాగంగా కపిల్ శర్మ ప్రేక్షకులతో మాట్లాడుతుండగా, ఓ అభిమాని మైక్ అందుకుని సంజయ్ దత్‌తో మాట్లాడుతూ… “సంజయ్ సర్, ఈ రోజు నేను షోకు నా భార్య, నా గర్ల్‌ఫ్రెండ్ ఇద్దరితో కలిసి వచ్చాను” అని చెప్పడంతో సెట్‌లో పిన్ డ్రాప్ సైలెన్స్ నెలకొంది. ఈ మాట విన్న సంజయ్ దత్, సునీల్ శెట్టి, కపిల్ శర్మ, అర్చనా పూరన్ సింగ్ షాక్‌కు గురయ్యారు. ఒకేసారి భార్యను, ప్రియురాలిని ఒకేచోటికి తీసుకురావడం ఏంటని అందరూ నోరెళ్లబెట్టారు. కాసేపటికి తేరుకున్న సంజయ్ దత్, ఆ అభిమాని వద్దకు వెళ్లి నవ్వుతూ, “ఇది మీరెలా చేయగలిగారు? దయచేసి ఆ టెక్నిక్ ఏంటో మాకూ చెప్పండి” అని అడగడంతో షో మొత్తం నవ్వులతో దద్దరిల్లింది. ఈ సరదా సంభాషణకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. “సంజయ్ దత్, సునీల్ శెట్టి షాక్ అయ్యారు, కానీ ఆ అబ్బాయి మాత్రం రాక్ చేశాడు” అని ఒకరు కామెంట్ చేయగా, “ఈ ఎపిసోడ్ టీఆర్పీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం” అని మరొకరు రాశారు. “వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇదేనేమో” అంటూ నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కారు, బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే కాస్త ఆగండి..

Elephants: ఇకపై ఏనుగుల జాడ ముందే తెలిసిపోతుంది

నాన్‌ ఏసీలో.. ఏసీ ఎఫెక్ట్‌.. ఐడియా అదిరింది భయ్యా

తాళి కట్టాలంటే చర్నాకోల దెబ్బలు తినాల్సిందే..!

క్షణక్షణం..భయం భయం.. చేతబడులతో వణికిపోతున్న గ్రామం