స్టార్ హీరోయిన్స్ చూపు కూడా నార్త్ వైపే.. కారణం అదేనా
టాలీవుడ్లో హీరోయిన్ల కొరత ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడి స్టార్ హీరోయిన్స్ బాలీవుడ్ వైపు అడుగులు వేయడమే దీనికి ప్రధాన కారణం. రష్మిక మందన, సాయి పల్లవి, శ్రీలీలా వంటి తారలు బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాది స్క్రీన్పై ఏర్పడిన గ్యాప్ను భర్తీ చేయడానికి కొత్త తరం హీరోయిన్స్ సిద్ధమవుతున్నారు.
టాలీవుడ్ స్క్రీన్పై హీరోయిన్ల కొరత అనేది నిరంతర సమస్యగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం, ఇక్కడ విజయం సాధించిన తారలు బాలీవుడ్ వైపు దృష్టి సారించడమే. ప్రస్తుతం టాలీవుడ్లో అగ్రస్థానంలో ఉన్న భామలు సైతం ఉత్తరాది చిత్రసీమలో తమను తాము నిమగ్నం చేసుకుంటున్నారు. దీంతో దక్షిణాది చిత్రాలకు దూరం అవుతున్నారు. ఈ ఖాళీని పూడ్చేందుకు యువ తరం హీరోయిన్స్ ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఫామ్లో ఉన్న సౌత్ బ్యూటీ రష్మిక మందన బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. నెమ్మదిగా సౌత్ సినిమాలకు దూరమవుతున్న రష్మిక, నార్త్లో కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెర ముందే కాదు.. తెర వెనుక కూడా మా సత్తా చాటుతా అంటున్న సామ్
డిఫరెంట్ లుక్స్ తో అభిమానుల అంచనాలు పెంచేస్తున్న స్టార్ హీరోలు
ఓజీ-2 అప్డేట్ ఇచ్చిన సుజీత్.. హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్
