రిషబ్‌ శెట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి..? బాలీవుడ్ మూవీ చేస్తారా.? టాలీవుడ్‌కు ఓటేస్తారా?వీడియో

Updated on: Nov 03, 2025 | 12:30 PM

కాంతారా విజయం తర్వాత రిషబ్ శెట్టి తదుపరి పాన్ ఇండియా ప్రాజెక్టుపై ఉత్కంఠ నెలకొంది. కాంతారా చాప్టర్ 1 అనంతరం ఆయన జై హనుమాన్ లేదా బాలీవుడ్ చిత్రం ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్లలో దేనిని ముందుగా ప్రారంభిస్తారనే విషయంలో స్పష్టత కొరవడింది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతారా సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించిన కాంతారా తర్వాత, ఆయన దర్శకత్వం వహించి నటించిన ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1 కూడా విడుదల కావడంతో, రిషబ్ తదుపరి ప్రాజెక్టులపై చర్చ మొదలైంది. ప్రస్తుతం రెండు పెద్ద ప్రాజెక్టులు ఆయన ముందున్నాయి. ఒకటి, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించేందుకు రిషబ్ ఇప్పటికే అంగీకరించారు. దీని ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే అంచనాలను పెంచింది. మరొకటి, బాలీవుడ్ మేకర్ సందీప్ సింగ్ నిర్మిస్తున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్.

మరిన్ని వీడియోల కోసం :

తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి..గదిలో సీన్‌ చూసి షాక్‌ వీడియో

మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో

రూ.11 కోట్ల జాక్‌పాట్‌ కొట్టాడు..కానీ వీడియో