ప్రభాస్‌ ట్రీట్‌కి.. ఫిదా అయిన కరీనా.. ‘ది బెస్ట్’ అంటూ కరీనా కపూర్ పోస్ట్.. వీడియో

Edited By:

Updated on: Sep 30, 2021 | 6:21 AM

పాన్‌ఇండియా హీరోగా మారిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తన కో యాక్టర్స్‌తో ఎంతో సరదాగా ఉంటారు. అప్పుడప్పుడు వారికి ఫుడ్‌ పార్టీ ఇస్తుంటారు.

పాన్‌ఇండియా హీరోగా మారిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తన కో యాక్టర్స్‌తో ఎంతో సరదాగా ఉంటారు. అప్పుడప్పుడు వారికి ఫుడ్‌ పార్టీ ఇస్తుంటారు. ఈ క్రమంలో ఆదిపురుష్‌ సినిమాలో రావణ్‌ పాత్రలో నటిస్తున్న సైఫ్‌ అలీఖాన్‌కు ఈ పాన్‌ ఇండియా స్టార్‌ బిర్యానీ పంపించారు. దీనికి సంబంధించిన ఫొటోను బాలీవుడ్‌ బ్యూటీ, సైఫ్‌ భార్య కరీనా కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్ స్టోర్‌లో షేర్ చేసారు. బాహుబ‌లి బిర్యానీ పంపించాడంటే అది క‌చ్చితంగా బెస్ట్‌ అయ్యి ఉంటుంది. థ్యాంక్యూ ప్రభాస్, ఇలాంటి అద్భుతమైన భోజనం పంపినందుకు అని కామెంట్‌ కూడా రాసారు. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన కరీనా ఫుడ్‌ లవర్‌ కూడా. తన సోదరి కరిష్మా కపూర్‌, బెస్ట్‌ ఫ్రెండ్స్‌తో కలిసి పుడ్‌ తింటూ ఎంజాయ్‌ చేస్తున్న వీడియోలను ఎన్నో సార్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు కరీనా. దీంతో ప్రభాస్‌ పంపించిన బిర్యానీ ఆకలి పెంచింది అంటూ లొట్టలేస్తూ తిన్నారు. ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బెంగుళూరులో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. వీడియో

Viral Video: అద్దెకు గర్ల్ ఫ్రెండ్.. లక్షల్లో ఖర్చు చేస్తున్న యువత! వీడియో

Published on: Sep 29, 2021 10:15 PM
Loading...
Unable to load recommendations.
Follow Us