Pawan Kalyan: ఆ సమయం వచ్చింది.. పవన్ సంచలన ట్వీట్
AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు పిలుపునిచ్చారు. టీటీడీ కేవలం యాత్రా స్థలం కాదని, పవిత్ర ఆధ్యాత్మిక యాత్ర అని నొక్కిచెప్పారు. తిరుపతి లడ్డూ కేవలం తీపి పదార్థం కాదని, అదొక భావోద్వేగమన్నారు. సనాతన ధర్మం, భక్తుల విశ్వాసాలను ఎవరూ అవమానించకూడదని, సెక్యులరిజం అంటే పరస్పర గౌరవం అని పవన్ స్పష్టం చేశారు.
AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్ చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం వచ్చిందన్నారు. టీటీడీ ప్రపంచ హిందూ సమాజానికి యాత్రా స్థలమే కాదని.. పవిత్ర ఆధ్యాత్మిక యాత్ర అన్నారు. తిరుపతి లడ్డూ అనేది తీపి పదార్థంగా చూడొద్దని.. అదొక భావోద్వేగమన్నారు పవన్కల్యాణ్. ఏడాదికి సగటున రెండున్నర కోట్ల మంది భక్తులు వస్తుంటారని.. విశ్వాసం, సనాతన ధర్మ భావాలను ఎవరైనా ఎగతాళి చేసినా దెబ్బతీసినా అది ఆధ్యాత్మిక నమ్మకాన్ని దెబ్బతీస్తుందన్నారు. సెక్యులరిజం అంటే రెండు వైపులా గౌరవం ఉండాలని.. సనాతన ధర్మం అత్యంత పురాతనమైన, నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికత అని పవన్ అన్నారు .
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదీ అసలైన రణరంగమంటే బురద నీళ్లతో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్
TOP 9 ET News: సర్ప్రైజెస్తో దిమ్మతిరిగేలా చేస్తున్న జక్కన్న
థాంక్యూ ప్రభాస్! భోజనంతో కడుపు మాత్రమే కాదు.. నా హృదయం కూడా నింపేసావు’
‘మా నాన్న చనిపోలేదు..’ తప్పుడు వార్తలపై ధర్మేంద్ర కూతురు సీరియస్
‘మెడలో నక్లెస్ కాదు.. పెళ్లికి వడ్డానం కూడా పెట్టుకుంటా’ ట్రోలర్స్కు శిరీష్ దిమ్మతిరిగే పంచ్
