Kangana Ranaut: గ్యాంగ్‌స్టర్‌తో పార్టీ చేసుకున్న బ్యూటీ ?? రూమర్లకు చెక్‌ పెట్టిన కంగనా

|

May 31, 2024 | 1:11 PM

సినిమాలు, రాజకీయాలు.. అనే రెండు పడవల మీద ప్రయాణం చేయనని చెప్పేసింది బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ . తాను ఎంపీగా గెలిస్తే సినిమాలు మానేస్తానని ప్రకటించింది. పూర్తిగా ప్రజా సేవకే పరిమితమవుతానంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ బ్యూటీ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో ఉంటుంది. తాజాగా కంగనా గురించి ఓ వార్త వైరల్‌గా మారింది. ఆమె ఓ వ్యక్తితో దిగిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సినిమాలు, రాజకీయాలు.. అనే రెండు పడవల మీద ప్రయాణం చేయనని చెప్పేసింది బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ . తాను ఎంపీగా గెలిస్తే సినిమాలు మానేస్తానని ప్రకటించింది. పూర్తిగా ప్రజా సేవకే పరిమితమవుతానంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ బ్యూటీ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో ఉంటుంది. తాజాగా కంగనా గురించి ఓ వార్త వైరల్‌గా మారింది. ఆమె ఓ వ్యక్తితో దిగిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అతడు గ్యాంగ్‌స్టర్‌ అబు సలీమ్‌ అని.. అతడితో పార్టీ చేసుకుందని ప్రచారం చేస్తున్నారు. దీనిపై కంగనా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించింది. గ్యాంగ్‌స్టర్‌ అబు సలీమ్‌తో పార్టీనా? అక్కడ ఉన్నది మిస్టర్‌ మార్క్‌ మాన్యూల్‌ అనే జర్నలిస్ట్‌. తనను గ్యాంగ్‌స్టర్‌తో పోల్చి అవమానిస్తున్నారని… ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన పార్టీలో ఆయనతో దిగిన ఫోటో ఇది అని ఇన్‌స్టా స్టోరీ ద్వారా క్లారిటీ ఇచ్చింది. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎమర్జెన్సీ. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టింది. ఇందులో అనుపమ్‌ ఖేర్, శ్రేయాస్‌ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్‌ సోమన్, సతీష్‌ కౌశిక్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. జూన్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్రెడిట్‌ కార్డ్‌ యాక్టివేట్‌ చేస్తామంటూ.. బ్యాంక్‌ అకౌంట్‌ లూఠీ

కరోనా తరహా మరో సంక్షోభం తప్పదు.. బ్రిటన్‌ హెచ్చరిక

మౌంట్ ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జాం.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Follow us on