Jr NTR: వెండితెర మీద 25 ఏళ్లు పూర్తి చేసుకున్న NTR
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెర ప్రవేశించి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు చేసుకుంటున్నారు. తొలి చిత్రంతో నిరాశపరిచినా, అంచనాలను అధిగమించి ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్గా ఎదిగారు. "ఆర్ఆర్ఆర్"తో అంతర్జాతీయ ఖ్యాతి పొంది, "దేవర"తో పాన్ ఇండియా మార్కెట్ను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రస్తుతం డ్రాగన్ చిత్రంలో నటిస్తూ, తన సినీ ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకుంటున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెర ప్రయాణానికి పాతికేళ్లు పూర్తయ్యాయి. ఈ మైలురాయిని అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా తారక్ కెరీర్ ప్రస్తుతం అత్యున్నత దశలో ఉండడంతో ఈ సంబరాలు మరింత జోష్గా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సినీ ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. సరిగ్గా పాతికేళ్ల క్రితం నిన్ను చూడాలని చిత్రంతో తారక్ సినీ రంగ ప్రవేశం చేశారు. ఎన్టీఆర్ వారసుడిగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఆయన తొలి సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచారు. అయితే, ఆ వైఫల్యం తారక్లో మరింత పట్టుదలను పెంచింది. ఒక్కో సినిమాతో తనను తాను మెరుగుపరుచుకుంటూ స్టార్డమ్ను చేరుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Arjun Kapoor: వరుస ఇబ్బందులతో డిప్రెషన్ లోకి వెళ్ళా.. ఇప్పుడు ఇలా..
భన్సాలీ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్.. హీరామండి
ఒకే సీజన్లో రానున్న మహేష్, అల్లు అర్జున్.. టాలీవుడ్ గ్లోబల్ వార్ పక్కా
సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న హనీ రోజ్.. ఈసారి మోత మోగిపోతాది అంతే
Allu Arjun: వైరల్ అవుతున్న ఐకాన్ స్టార్ స్క్రీన్ సేవర్…. మార్చి వరకు మార్చేదే లే