ప్రేమ విషయంలో మరో హింట్‌ ఇచ్చిన జాన్వీ

Updated on: Nov 15, 2025 | 10:19 AM

జాన్వీ కపూర్ ఇప్పుడు దక్షిణాదిన కూడా హాట్ టాపిక్‌గా మారారు. ముఖ్యంగా శిఖర్ పహారియాతో ఆమె ప్రేమ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తలను ఖండించకుండా, జాన్వీ తన చర్యల ద్వారా మరింత హింట్స్ ఇస్తున్నారు. ఇటీవల బోనీ కపూర్ పుట్టినరోజు వేడుకల్లో శిఖర్‌తో కలిసి కనిపించడం ఆమె రిలేషన్ షిప్ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.

ఇన్నాళ్లూ నార్త్ ఇండస్ట్రీలో ట్రెండింగ్‌లో ఉన్న నటి జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారారు. టాప్ స్టార్స్‌తో సినిమాలు చేస్తుండటంతో, జాన్వీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంపై దక్షిణాదిలో తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా శిఖర్ పహారియాతో జాన్వీ రిలేషన్‌షిప్‌కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. తొలి సినిమా ధడక్తోనే అందరి దృష్టిని ఆకర్షించిన జాన్వీ, ఆ తర్వాత విమెన్ సెంట్రిక్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ, ప్రస్తుతం దక్షిణాదిలో బిజీగా ఉన్నారు. జాన్వీ ఎక్కడికి వెళ్లినా శిఖర్ పక్కనే కనిపిస్తుండటంతో, వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్న ప్రచారం బలపడింది. ఈ వార్తలను ఖండించకపోగా, జాన్వీ హింట్స్ ఇస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంతర్జాతీయ జాబితాలో సౌత్ సినిమాల హవా.. అట్లుంటది మనతోని

డిఫరెంట్‌ స్ట్రాటజీస్ తో దూసుకుపోతున్న రష్మిక

Shriya Saran: స్పీడు పెంచిన శ్రియా శరణ్

వరుసగా పెద్ది అప్‌డేట్స్.. చెర్రీ స్పీడుకు రీజనేంటి?

Meenakshi Chowdary: సీనియర్ హీరోలతో జోడీకి రెడీ అంటున్న మీనాక్షి