Rakul Preet Singh: 250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట – నష్టాలు.! చిక్కుల్లో రకుల్ హస్బెండ్.

|

Jun 26, 2024 | 6:04 PM

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలీవుడ్ నిర్మాత , నటుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ.. ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టారు. హిందీ చిత్ర పరిశ్రమలో పెద్ద నిర్మాత అయిన జాకీ భగ్నానీతో చేతులు కలిపి రకుల్ ప్రీత్ సింగ్ జీవితం సెటిల్ అయిందని అందరూ అనుకున్నారు.

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలీవుడ్ నిర్మాత , నటుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ.. ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టారు. హిందీ చిత్ర పరిశ్రమలో పెద్ద నిర్మాత అయిన జాకీ భగ్నానీతో చేతులు కలిపి రకుల్ ప్రీత్ సింగ్ జీవితం సెటిల్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా జాకీ భగ్నాని కుటుంబం కష్టాల్లో కూరుకుపోయింది. 250 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాడు జాకీ భగ్నాని. దీంతో జాకీ భగ్నానీ తన ఆస్తిలని అమ్ముకుంటున్నాడని బాలీవుడ్ లో టాక్. జాకీ భగ్నానీకి ‘పూజా ఎంటర్‌టైన్‌మెంట్’ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఈ మధ్య కాలంలో ఈ సంస్థ నిర్మించిన సినిమాలన్నీ ఘోర పరాజయం పాలయ్యాయి.

ఈ ఏడాది తెరకెక్కిన ‘బడే మియా చోటే మియా’ సినిమాలో కూడా ఈ సంస్థ పెట్టుబడి పెట్టింది. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. దాంతో నిర్మాత నష్టాల్లో మునిగిపోయారు. ఇక జాకీ భగ్నానీ తన సంస్థలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు చాలా నెలలుగా జీతం చెల్లించలేదు. అతని మొత్తం అప్పు 250 కోట్ల రూపాయలకు చేరుకుంది. అందుకే ‘పూజా ఎంటర్‌టైన్‌మెంట్’ ఆఫీస్, 7 అంతస్థుల బిల్డింగ్‌ను అమ్మేశాడట ఈ స్టార్ ప్రొడ్యూసర్. అంతేకాదు తన ఎంటర్‌టైర్మెంట్ సంస్థ భారీ నష్టాల్లో ఉండడంతో.. ఈ సంస్థలో పని చేస్తున్నా దాదాను 80 శాతం మంది ఉద్యోగులను తొలగించారని తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on