బాలీవుడ్‌లో బయోపిక్ ల సందడి.. అక్కడ మంచి క్రేజ్ ఉంది గురూ

Edited By: Phani CH

Updated on: Dec 11, 2025 | 3:41 PM

సాధారణంగా గ్లామర్ పాత్రల్లో మెరిసే అందాల భామలు తమన్నా, కియారా, శ్రద్ధా కపూర్ ఇప్పుడు బయోపిక్స్ వైపు అడుగులు వేస్తున్నారు. తమన్నా ప్రముఖ నటి జయశ్రీగా, కియారా మీనా కుమారిగా, శ్రద్ధా మరాఠీ కళాకారిణి విఠాబాయిగా తెరపై కనిపించనున్నారు. ఈ గ్లామరస్ తారలు వింటేజ్ పాత్రలను ఎంచుకోవడం సినీ ప్రియులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఎప్పుడు గ్లామర్‌ రోల్స్‌లో కనిపించే అందాలు భామలు సడన్‌గా వింటేజ్‌ టచ్‌ ఇస్తే. త్వరలో అలాంటి కిక్కునే ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు మూవీ లవర్స్‌. ఈ మధ్య గ్లామర్‌ రోల్స్‌లో అదరగొట్టిన అందాల భామలు ఇప్పుడు బయోపిక్స్‌తో అభిమానులు ఊరిస్తున్నారు. ఎవరా బ్యూటీస్‌.. ఏంటి మూవీస్‌ హ్యావ్‌ ఏ లుక్‌. లీడ్ క్యారెక్టర్స్‌ కన్నా స్పెషల్ సాంగ్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్న తమన్నా… ఓ ప్రస్టీజియస్ మూవీలో కీ రోల్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. లెజెండరీ బాలీవుడ్ దర్శకుడు వీ శాంతారామ్ బయోపిక్‌లో ఇంపార్టెంట్‌ రోల్‌లో నటిస్తున్నారు. అలనాటి అందాల నటి జయశ్రీగా ఆమె తెర మీద కనిపించబోతున్నారు.క్రేజీ బ్యూటీ కియారా కూడా ఇంట్రస్టింగ్ బయోపిక్‌కు సిద్ధమవుతున్నారు. ప్రజెంట్ మెటర్నిటీ బ్రేక్‌లో ఉన్న ఈ బ్యూటీ త్వరలో కెమెగా ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. లెజెండరీ హీరోయిన్‌ మీనా కుమారి బయోపిక్‌లో టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు కియారా. మరో నార్త్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ కూడా బయోపిక్‌ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నారు. మరాఠి కళాకారిణి విఠాబాయి పాత్రలో నటించేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు శ్రద్ధా. గ్లామరస్‌ హీరోయిన్స్ అంతా ఒకేసారి వింటేజ్‌ టర్న్ తీసుకోవటం ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

JioHotstar: ఐసీసీకి జియోహాట్‌స్టార్ బిగ్‌ షాక్

ఆ నాణేలు చెల్లుబాటు అవుతాయా ?? RBI క్లారిటీ

షాకిస్తున్న కొత్త ఆదాయ పన్ను రూల్స్‌ !! ఇక వీరికి దబిడి దిబిడే

12 గంటల ప్రయాణం ఇక 5 గంటల్లోనే.. అబ్బా సాయి రామ్

ఫ్రీ గ్యాస్ కనెక్షన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి !!