మనీలాండరింగ్ కేసులో బుక్కైన శంకర్.. దాదాపు 10 కోట్ల ఆస్తులు జప్తు

Updated on: Feb 23, 2025 | 10:21 AM

దర్శకుడు శంకర్ పై అక్రమ మనీలాండరింగ్ కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది.ఈ కేసు విచారణలో ఉండగానే తొలి అడుగుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.10.11 కోట్ల విలువైన ఆయన ఆస్తులను జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. అక్రమ మనీలాండరింగ్‌లో ప్రమేయం ఉందనే ఆరోపణలపై 2022లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శంకర్ కు నోటీసు పంపారు.

ఆ సమయంలో, ఆయన తన న్యాయవాదితో కలిసి ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు హాజరయ్యాడు. దాదాపు 3 గంటలకు పైగా సాగిన ఈ విచారణ అప్పట్లో సంచలనంగా మారింది. శంకర్ గురించి ఆయన ఆస్తుల గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. ఇక అప్పటి నుంచి నడుస్తున్న ఈ కేసు.. ఇప్పటికీ కంటన్యూ అవుతోంది. శంకర్‌కు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే ఆయన ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రకటించడం.. కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో మాత్రమే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే హాట్ టాపిక్గా మారింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chhaava: ఛావా సినిమా ఫ్యాన్స్‌కు ప్రభుత్వం బంపర్ ఆఫర్ !