సుప్రీం కోర్టు లాయర్గా మారిన ఒకప్పటి క్రేజీ హీరోయిన్
రేష్మ రాథోడ్.. ఈ పేరు అంతగా గుర్తుకు ఉండకపోవచ్చు. కానీ 'ఈ రోజుల్లో' సినిమా బ్యూటీ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఆ సినిమాలో తన గ్లామర్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. సరైన అవకాశాలు లేకపోవడంతో సినిమాల నుంచి తప్పుకుంది. కట్ చేస్తే ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్గా తెగ బిజీ అయిపోయింది.
లా ప్రాక్టీస్తూ చేస్తూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ఈమె. రేష్మ రాథోడ్.. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కథానాయికగా మెప్పించింది. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావడంతో రేష్మకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ కరువయ్యాయి.అయినప్పటికీ యంగ్ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రేష్మ. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత రాజకీయాల్లో రాణించాలని చూసింది. ఓ పక్క రాజకీయాల్లో కంటిన్యూ అవుతూనే మరోవైపు లాయర్ కోర్సు పూర్తి చేసింది. కట్ చేస్తే… ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పని చేస్తోంది. ఇప్పుడీ ప్రొఫెషన్తో నెట్టింట వైరల్ అవుతోంది ఈ బ్యూటీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ. 6 కోట్లు పెడితే..రూ.128 కోట్లు వచ్చాయి ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ
ఇంజెక్షన్ కోసం 20 కి.మీ నడిచిన 92 ఏళ్ల బామ్మ.. చివరకు
ఆ ఒక్క చేప కోసం.. 300 డ్యామ్లు కూల్చేసిన చైనా..