సౌత్ బ్యూటీస్‌ కు బాలీవుడ్‌ లో ఇబ్బందులు

Updated on: May 05, 2026 | 12:46 PM

సౌత్ సినీ తారలు బాలీవుడ్‌ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సాయి పల్లవి, పూజా హెగ్డే వంటి తారలు భారీ హైప్‌ తో ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ అందుకోవడం కష్టమవుతోంది. కంటెంట్, మార్కెట్, ప్రేక్షకుల అభిరుచి అర్థం చేసుకుంటేనే బాలీవుడ్‌ లో విజయం సాధ్యం అంటున్నారు సినీ విశ్లేషకులు.

సౌత్ సినిమా రంగంలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న కథానాయికలు బాలీవుడ్ వైపు చూస్తున్నారు. సాయి పల్లవి, పూజా హెగ్డే, కీర్తి సురేష్ నుంచి శ్రీలీల వరకు అందరి ఆశలు నార్త్ సినిమా మార్కెట్‌ పైనే ఉన్నాయి. అయితే అక్కడ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. భారీ హైప్ తో ఎంట్రీ ఇచ్చినా, విజయం మాత్రం అందని ద్రాక్షలా మిగిలిపోతోంది. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఏక్ దిన్ సినిమాతో బాలీవుడ్‌ లో అడుగుపెట్టారు. ఆమీర్ తనయుడి సినిమాలో నటించడం, ఆమీర్ ఖాన్ స్వయంగా సాయి పల్లవిని బెస్ట్ హీరోయిన్ అని పొగడటంతో మంచి బజ్ ఏర్పడింది. కానీ సినిమా విడుదలయ్యాక ఆ స్థాయి వసూళ్లు సాధించలేకపోయింది. సౌత్‌ లో పాన్ ఇండియా బ్యూటీగా పేరుపొందిన పూజా హెగ్డేకు కూడా నార్త్ సినిమా అంతగా కలిసి రాలేదు. అక్కడ టాప్ హీరోలతో కలిసి నటించినా విజయం దక్కలేదు.

మరిన్ని వీడియోల కోసం :

వైరల్ అవుతున్న సారా అర్జున్‌ లేటెస్ట్ ఫోటో షూట్

టాలీవుడ్‌ లో మళ్లీ మొదలైన థియేటర్ల వివాదం

ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా దేవర సీక్వెల్

ముంచేస్తున్న ఫ్లాప్స్.. రావట్లేదు ఆఫర్స్

Follow Us