రూమర్స్కు ఫుల్ స్టాప్ పెట్టిన తారక్ వీడియో
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాపై గతంలో వచ్చిన రూమర్లకు నిర్మాతలు ఫుల్ స్టాప్ పెట్టారు. షూటింగ్ ఆగిపోయిందన్న వార్తలు అవాస్తవమని తేలింది. నవంబర్ మూడవ వారం నుంచి కొత్త షెడ్యూల్స్ మొదలుకానున్నాయి. 2026 చివరిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాపై గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న రకరకాల వార్తలకు చిత్ర యూనిట్ స్పష్టతనిచ్చింది. సినిమా షూటింగ్ ఆగిపోయిందని, ఎన్టీఆర్ అవుట్పుట్ పట్ల అసంతృప్తిగా ఉన్నాడని జరిగిన ప్రచారం కేవలం రూమర్లని తేలింది. చిత్ర యూనిట్ తాజా ప్రకటన ప్రకారం, డ్రాగన్ సినిమా విషయంలో అంతా సవ్యంగా ఉంది. ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ రీ-రైటింగ్ కోసం తీసుకున్న విరామం తర్వాత, ఇప్పుడు మరింత మెరుగైన డ్రాఫ్ట్తో సిద్ధంగా ఉన్నారు. అలాగే గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తారక్ కూడా షూటింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నవంబర్ మూడవ వారం నుంచి సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.
మరిన్ని వీడియోల కోసం :
