శింబుతో రిలేషన్కు చెక్ పెట్టింది! లక్కీ గర్ల్! లేదంటేనా..?
హైదరాబాద్ బ్యూటీ నిధి అగర్వాల్కు ఇప్పుడిప్పుడే మంచి రోజులు వస్తున్నాయి. ఓ పక్క పవన్ కళ్యాణ్తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న నిధి.. ఆ సినిమాతో మరికొన్ని రోజుల్లో ఆడియన్స్ ముందుకు వస్తోంది. మరో పక్క రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ డార్లింగ్గా కూడా నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో తన క్రేజ్ పెంచుకోవడం పక్కా అని ఫీలవుతోంది.
అలాంటి ఈ పరిస్థితుల్లో ఈ బ్యూటీని ‘శింబుతో రిలేషన్లో.. ‘ అనే న్యూస్ చిక్కుల్లో పడేలా చేస్తోంది. ఇది గ్రహించిందో ఏమో కానీ.. తాజాగా ఈ బ్యూటీ ఈ న్యూస్కు చెక్ పెట్టింది. తన క్లారిటీ మాటలతో ఇప్పుడు లక్కీ గార్ల్ అనే కామెంట్ తో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అసలు విషయం ఏంటంటే? నిధి అగర్వాల్ గతంలో శింబుతో కలిసి ఈశ్వరన్ సినిమా చేసింది. ఆ సినిమాలో వాళ్లిద్దరి కెమెస్ట్రీ టాక్ ఆఫ్ ది కోలీవుడ్ అయింది. దాంతో పాటే ఆఫ్ స్క్రీన్ కూడా వీళ్లిద్దరూ కలిసిన ఫోటోలు బయటికి రావడంతో.. వీళ్లద్దరి మధ్య సమ్ సమ్ థింగ్ ఉందనే న్యూస్ బయటికి వచ్చింది. అది ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక ఈక్రమంలోనే రంగంలోకి దిగిన ఈ బ్యూటీ.. ఈ వార్తలకు చెక్ పెట్టింది. శింబుతో తాను రిలేషన్లో లేనంటూ చెప్పింది. ఒక హీరోయిన్ సినిమాలోకి వచ్చినప్పుడు, ఆమె గురించి చాలా వదంతులు వస్తాయి. కానీ తాను అలాంటివి నమ్మనంటూ సింపుల్గా చెప్పేసింది. దీంతో ఈ బ్యూటీ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అలీకి మెగాస్టార్ చిరు స్పెషల్ గిఫ్ట్.. మురిసిపోయిన అలీ- జుబేదా