హర్ట్ అయిన అనసూయ..
నటి అనసూయ భరద్వాజ్ ఆన్లైన్ వేధింపులు, AI వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తించిన 42 మందిపై ఆమె కేసు పెట్టారు. పోలీసులు BNS, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఆన్లైన్ వేధింపులు, అసభ్యకరమైన AI వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ ఆమె 42 మందిపై కేసు పెట్టారు. ఇందులో ప్రముఖులు, కంటెంట్ క్రియేటర్లు, మీడియా ఛానెళ్లు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. గతంలో నటుడు శివాజీతో జరిగిన వివాదం నేపథ్యంలో ఈ ఫిర్యాదు ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు BNSలోని కఠినమైన సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద 42 మందిపై కేసులు నమోదు చేశారు. ప్రధానంగా మదన్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియా చౌదరి గోగినేని, పావని, శేఖర్ బాషా, రజని సహా పలువురిపై FIR నమోదైంది.
మరిన్ని వీడియోల కోసం :