ఏంటీ అరాచకం అట్లీ.. చిన్న యాడ్‌ షూట్‌కు 100కోట్లా

Updated on: Oct 21, 2025 | 5:31 PM

ఇప్పుడు సినిమా బడ్జెట్‌ మాత్రమే కాదు.. యాడ్ బడ్జెట్‌ కూడా కోట్లలో పెరిగిపోతోంది. నిన్న మొన్నటి వరకు ఒక యాడ్ చేయడానికి దాదాపు 50 లక్షల నుంచి 10 కోట్ల వరకు ఖర్చయ్యేది. కానీ అది ఇప్పుడు 100 కోట్లకు చేరింది. అదే ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది. చింగ్స్‌ దేశీ చైనీస్‌. ఇదో ఇన్‌స్టెంట్ చైనీస్‌ ఫుడ్స్‌ బ్రాండ్‌. ఇండియాలో తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం కోసం రణ్‌వీర్ సింగ్‌ను ఎప్పుడో బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.

ఇప్పుడు సినిమా బడ్జెట్‌ మాత్రమే కాదు.. యాడ్ బడ్జెట్‌ కూడా కోట్లలో పెరిగిపోతోంది. నిన్న మొన్నటి వరకు ఒక యాడ్ చేయడానికి దాదాపు 50 లక్షల నుంచి 10 కోట్ల వరకు ఖర్చయ్యేది. కానీ అది ఇప్పుడు 100 కోట్లకు చేరింది. అదే ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది. చింగ్స్‌ దేశీ చైనీస్‌. ఇదో ఇన్‌స్టెంట్ చైనీస్‌ ఫుడ్స్‌ బ్రాండ్‌. ఇండియాలో తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం కోసం రణ్‌వీర్ సింగ్‌ను ఎప్పుడో బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఆయనతో యాడ్స్‌ కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే మరో కొత్త యాడ్‌ కోసం.. అట్లీని అప్రోచ్ అయింది. ఇక సినిమాలకే డబ్బులు నీళ్లలా ఖర్చు చేసే అలవాటున్న అట్లీ.. ఈ కంపెనీ కోసం కూడా 100 కోట్ల బడ్జెట్‌లో ఓ యాడ్‌ను ప్లాన్ చేశాడు. అందుకోసం ఎజెంట్ కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడు. ఇందులో రణ్‌ వీర్ సింగ్ ఏజెంట్ చింగ్‌గా కనిపిస్తే.. శ్రీలీల ఏజెంట్ మిర్చిగా కనిపిచింది. ఇక ఈ యాడ్‌లో విలన్‌గా బాబీ డియోల్ కనిపించాడు. జవాన్ సినిమా కాన్సెప్ట్‌నే కుదించి చూపించినట్టుగా ఉన్న యాడ్‌కు 100 కోట్లు ఖర్చవడం..అందుకు తగ్గకుండా సదరు కంపెనీ ఖర్చుపెట్టడమే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫైనల్ రిపోర్ట్‌.. దర్శన్‌కు బిగ్ ఝలక్

Kantara Chapter 1: కాంతార దెబ్బకు.. ఛావా రికార్డ్‌ బ్లాస్ట్

ఈ దీపావళి రష్మికకు ఎందుకంత స్పెషల్‌

దీపిక రూట్లో ఆలియా.. అలా ఫిక్సయ్యారా ??

వెంకీ డైరక్షన్‌లో మాస్‌ మహరాజ్‌.. స్టోరీ రెడీయా ??