శ్రీశైలం ఆలయ గోపురంపై నాగుపాము సంచారం
విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు స్నేక్ క్యాచర్ కాళీ చరణ్కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న కాళీచరణ్ శివాజీ గోపురం పైకెక్కి నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం సురక్షితంగా ఆ పామును అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఆ వీడియో ప్రజంట్ నెట్టింట వైరల్ అవుతుంది.
శ్రీశైలం ఆలయ శివాజీ గోపురంపై నాగుపాము సంచారం కలకలం రేపింది. దసరా మహోత్సవాలు సందర్భంగా… లైటింగ్ వేసేందుకు గోపురం పైకెక్కిన లైటింగ్ సిబ్బందికి నాగుపాము తారసపడింది. దీంతో భయంతో కిందకు దిగిన లైటింగ్ సిబ్బంది.. ఆలయ అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు.. స్నేక్ క్యాచర్ కాళీ చరణ్కు సమాచారం ఇవ్వడంతో.. అతడి వచ్చి పామును చౌకచక్యంగా బంధించాడు. అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలో వదిలేశాడు. నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం రోజు.. శివాజీ గోపురంపై నాగుపాము ప్రత్యక్షం కావడం పరమేశ్వరుడి మహిమే అంటున్నారు భక్తులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Published on: Oct 15, 2023 04:50 PM
వైరల్ వీడియోలు
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

