AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

Guntur: రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

Ravi Kiran
|

Updated on: Mar 29, 2024 | 3:23 PM

Share

ఆ గ్రామంలోని రొయ్యల ఫ్యాక్టరీలో ఒక్కసారి అలజడి రేగింది. రయ్.. రయ్.. మంటూ ఓ నాలుగైదు వాహనాలు ఫ్యాక్టరీలోకి వచ్చాయి. సూటూ, బూటూ వేసుకుని అధికారులు ఒక్కొక్కరిగా ఫ్యాక్టరీలోని ఓ రూమ్‌లో ఉన్న రొయ్యల కంటైనర్‌ను సెర్చ్ చేశారు. ఇక అందులోని ఒక అట్టెపెట్టె‌లో ఏవో పార్శిల్స్ ఉన్నాయి.. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే.?

ఆ గ్రామంలోని రొయ్యల ఫ్యాక్టరీలో ఒక్కసారి అలజడి రేగింది. రయ్.. రయ్.. మంటూ ఓ నాలుగైదు వాహనాలు ఫ్యాక్టరీలోకి వచ్చాయి. సూటూ, బూటూ వేసుకుని అధికారులు ఒక్కొక్కరిగా ఫ్యాక్టరీలోని ఓ రూమ్‌లో ఉన్న రొయ్యల కంటైనర్‌ను సెర్చ్ చేశారు. ఇక అందులోని ఒక అట్టెపెట్టె‌లో రూ. 56 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆ వివరాల్లోకెళ్తే.. బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం గ్రామంలోని రాయల్ మెరైన్ ఫ్యాక్టరీలో సుమారు 56 లక్షల రూపాయలు అక్రమ నగదును స్వాధీనం చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఈ ఫ్యాక్టరీ బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్ధికి చెందినదిగా అధికారులు తెలిపారు. పక్కాగా సమాచారం అందుకున్న అధికారులు కంటైనర్‌లో దాచిన నగదును స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత నగదుకు సరైన పత్రాలు లేనందున నగదును ట్రెజరీకి అప్పచెబుతున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ వన్ అధికారి తెలిపారు.