Tirumala: తిరుమల మెట్ల మార్గంలో చిన్నారిపై చిరుత దాడి

|

Jun 23, 2023 | 8:46 PM

తిరుమలలో చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఈ ఘటన అలిపిరి నడక మార్గలంలో చోటుచేసుకుంది. ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఐదేళ్ల బాలుడు కౌశిక్‌పై చిరుత దాడి చేసింది. తన తాతతో కలిసి వెళ్తున్న సమయంలో బాలుడిపై ఈ దాడి జరిగింది. బాలుడిని నోట కరచుకుని పొదల్లోకి లాక్కెళ్లేందుకు చిరుత

తిరుమలలో చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఈ ఘటన అలిపిరి నడక మార్గలంలో చోటుచేసుకుంది. ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఐదేళ్ల బాలుడు కౌశిక్‌పై చిరుత దాడి చేసింది. తన తాతతో కలిసి వెళ్తున్న సమయంలో బాలుడిపై ఈ దాడి జరిగింది. బాలుడిని నోట కరచుకుని పొదల్లోకి లాక్కెళ్లేందుకు చిరుత ప్రయత్నించగా, పక్కనే ఉన్న భక్తులు, పోలీసులు గట్టిగా కేకలు వేస్తూ వెంటపడ్డారు. దీంతో చిరుత భయంతో బాలుడిని అక్కడే వదిలేసి వెళ్లింది. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వెంటనే భద్రతా సిబ్బంది బాలుడిని తిరుపతి స్విమ్స్‌కు తరలించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

త్రుటి లో తప్పిన మరో రైలు ప్రమాదం.. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..

Pink Whatsapp: పింక్‌ వాట్సాప్‌తో జాగ్రత్త.. ఆ లింక్ క్లిక్ చేసారో అంతే..

Weather Report: 6 జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ..

 

Follow us on