AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ డబ్బు - మీ హక్కు !! బ్యాంకుల్లో మర్చిపోయిన వేల కోట్లు.. ఆర్బీఐ సరికొత్త ప్రచారం

మీ డబ్బు – మీ హక్కు !! బ్యాంకుల్లో మర్చిపోయిన వేల కోట్లు.. ఆర్బీఐ సరికొత్త ప్రచారం

Phani CH
|

Updated on: Mar 17, 2026 | 4:34 PM

Share

భారతీయ బ్యాంకుల్లో ₹74,580 కోట్ల కంటే ఎక్కువ క్లెయిమ్ చేయని నిధులు పేరుకుపోయాయి. ఈ డబ్బు మీదే కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యులది కావచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఉద్గమ్ పోర్టల్ ద్వారా, ప్రజలు తమ క్లెయిమ్ చేయని డిపాజిట్లను సులభంగా గుర్తించి, మీ డబ్బు, మీ హక్కు ప్రచారం కింద తిరిగి పొందవచ్చు.

భారతీయ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఏటికేడు పెరుగుతున్నాయి. 2025 మార్చి నాటికి, బ్యాంకులు ₹74,580 కోట్లకు పైగా క్లెయిమ్ చేయని నిధులను కలిగి ఉన్నాయి, ఇది డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ) ఫండ్‌కు బదిలీ చేయబడింది. ఈ మొత్తాలు బీమా, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ప్రావిడెంట్ ఫండ్‌లను కలిపితే లక్షల కోట్లకు చేరతాయి. 10 సంవత్సరాలకు పైగా ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లను అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లుగా బ్యాంకులు పరిగణిస్తాయి. ప్రజలు తమ క్లెయిమ్ చేయని నిధులను గుర్తించడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉద్గమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా, ఖాతాదారులు తమ లేదా తమ కుటుంబ సభ్యుల పాత ఖాతాలు లేదా ఇతర ఆర్థిక సాధనాల్లో పేరుకుపోయిన డబ్బును కనుగొనవచ్చు. తమ డబ్బును తిరిగి పొందే హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆప్కీ పూంజీ ఆప్కా అధికార్ (మీ డబ్బు, మీ హక్కు) ప్రచారాన్ని కూడా కేంద్రం చేపట్టింది. ఉద్గమ్ పోర్టల్‌లో మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకుని, పాన్, ఆధార్ వంటి వివరాలతో శోధించడం ద్వారా మీ క్లెయిమ్ చేయని డిపాజిట్ల సమాచారాన్ని పొందవచ్చు. సంబంధిత బ్యాంకును సంప్రదించి, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిలిండర్ కోసం ‘చెప్పుల’ క్యూ !! ప్రజలకు తీరని గ్యాస్ కష్టాలు !!

Follow Us