కరుడుగట్టిన నేరగాళ్ల కు రాచమర్యాదలు

Updated on: Nov 09, 2025 | 5:47 PM

బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో సీరియల్ కిల్లర్స్, రేపిస్టులు, ఇతర కఠిన నేరగాళ్లకు టీవీ, సెల్ ఫోన్లతో కూడిన రాజమర్యాదలు లభిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగడంతో ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో కరుడుగట్టిన నేరగాళ్లకు, సీరియల్ కిల్లర్లకు, రేపిస్టులకు రాజమర్యాదలు అందుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో తీవ్ర కలకలం చెలరేగింది. సెల్ ఫోన్లు, టీవీలతో సహా పలు సౌకర్యాలను ఖైదీలు పొందుతున్నారని, దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ. 60కోట్ల చిక్కుల్లో శిల్పాశెట్టి.. బిగుసుకుంటున్న కేసు

SSMB29: అత్యంత దుష్ట, క్రూర,శక్తివంతమైన నా విలన్‌ ఇతడే..

అతను జర్నలిస్టు కాదు..! సీరియస్‌ కామెంట్స్ చేసిన హీరోయిన్

తనూజ, దివ్య మధ్య పోరుతో భరణి బేజారు

TOP 9 ET News: ఆ ప్రాజెక్ట్ సెట్టు అయితే అందనంత ఎత్తుకు అల్లు అర్జున్