ఓర్నీ.. బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా.. వాస్తవం ఇదే
కిడ్నీలో రాళ్లకు బీర్ తాగితే తగ్గుతుందనేది అపోహ మాత్రమే. బీర్ మూత్రపిండాలను డీహైడ్రేషన్ చేసి, యూరిక్ యాసిడ్ పెంచుతుంది. ఇది రాళ్లను మరింత గట్టిపరుస్తుంది లేదా కొత్తవి ఏర్పడేలా చేస్తుంది. 5 మి.మీ. కంటే పెద్ద రాళ్లు బీర్తో పోవు, మరింత ప్రమాదకరం. సరైన చికిత్సకు వైద్యుడిని సంప్రదించి, నీరు ఎక్కువగా తాగడం ఉత్తమం.
ప్రస్తుత కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. విపరీతమైన కడుపు నొప్పి, మూత్ర విసర్జనలో మంట వంటి లక్షణాలు ఎదురైనప్పుడు చాలా మంది రకరకాల చిట్కాలను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి అనే ఒక అపోహ సమాజంలో బలంగా నాటుకుపోయింది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో వైద్య శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బీర్ తాగడం వల్ల కిడ్నీ రాళ్లు పోతాయన్నది ఎంత వరకూ నిజమనేది పక్కన పెడితే.. వైద్య శాస్త్రం ప్రకారం.. బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు పోవడానికి బదులు, మూత్రపిండాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీఆర్ తాగడం వల్ల కిడ్నీలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీర్ ఒక మూత్రవిసర్జన కారకం. అంటే దీనిని తాగినప్పుడు మూత్రం ఎక్కువగా వస్తుంది. దీనివల్ల శరీరం నుంచి నీరు వేగంగా బయటకు వెళ్లిపోయి, శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. నిజానికి కిడ్నీలో రాళ్లు బయటకు రావాలంటే శరీరానికి అధిక మోతాదులో నీరు అవసరం. కానీ బీర్ వల్ల శరీరం ఎండిపోయి, రాళ్లు మరింత గట్టిపడే అవకాశం ఉంది. బీరులో ప్యూరిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో జీర్ణమైన తర్వాత యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. నిరంతరం బీర్ తాగడం వల్ల ఈ యూరిక్ యాసిడ్ పెరిగి, కొత్త రాళ్లు ఏర్పడే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కిడ్నీలో రాయి 5 మి.మీ కంటే పెద్దగా ఉంటే..అది ఏ డ్రింక్తోనూ దానంతట అది బయటకు రాదు. బీర్ తాగడం వల్ల మూత్ర పీడనం పెరిగితే, ఆ రాయి మూత్ర నాళంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల నరకప్రాయమైన నొప్పి కలగడమే కాకుండా ఇన్ఫెక్షన్లకు కూడా దారి తీస్తుంది. మూత్రం ఎక్కువగా రావడం వల్ల రాళ్లు పోయినట్లు తాత్కాలికంగా అనిపించినా, దీర్ఘకాలంలో బీర్ వల్ల కాలేయం, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటాయి. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నప్పుడు సొంత వైద్యం కాకుండా వెంటనే డాక్టరును సంప్రదించి, సరైన చికిత్స తీసుకోవడమే ఉత్తమం. కిడ్నీ రాళ్లను నివారించడానికి రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం, నిమ్మరసం తీసుకోవడం వంటి సహజ పద్ధతులను అనుసరించడం మంచిది. కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు తప్పక వైద్యులను సంప్రదించాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎంతైనా అమ్మ.. అమ్మే.. ఇంటికొచ్చిన కొడుక్కి వెరైటీ వెల్కమ్.. ఫిదా అవుతున్న నెటిజన్లు
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

