Watch: ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. మునుగోడులో పరిస్థితి ఉద్రిక్తం

Edited By:

Updated on: Nov 01, 2022 | 3:03 PM

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. మునుగోడు మండలం పలివెల గ్రామంలో ఈటల రాజేందర్‌ ప్రచారం చేస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పలు వాహనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. ఇరు వర్గాల ఘర్షణతో పలివెలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Published on: Nov 01, 2022 02:22 PM