అయోధ్య రామయ్యకు భక్తితో బంగారు పాదుకలు..

|

Jan 12, 2024 | 9:40 PM

జనవరి 22న కొలువుదీరనున్న అయోధ్య రాముడికి మన హైదరాబాద్‌ నుంచి అపురూపమైన కానుకలు అందనున్నాయి. రామ మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకొనేలా చేయడంలో మన శిల్పులు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే అయోధ్య రామాలయానికి 118 దర్వాజలు హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్‌ డిపోలో రూపుదిద్దుకొంటుండగా.. ఆ నీలమేఘశ్యాముడికి రెండు జతల బంగారు పాదుకలు కూడా అందబోతున్నాయి.

జనవరి 22న కొలువుదీరనున్న అయోధ్య రాముడికి మన హైదరాబాద్‌ నుంచి అపురూపమైన కానుకలు అందనున్నాయి. రామ మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకొనేలా చేయడంలో మన శిల్పులు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే అయోధ్య రామాలయానికి 118 దర్వాజలు హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్‌ డిపోలో రూపుదిద్దుకొంటుండగా.. ఆ నీలమేఘశ్యాముడికి రెండు జతల బంగారు పాదుకలు కూడా అందబోతున్నాయి. రూ.1.03 కోట్ల విలువైన బంగారం పాదుకలను నగరానికి చెందిన అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్‌ సీతారామ చంద్రుడికి అందిస్తుంది. ఇప్పటికే ఒక జత పాదుకలను భక్తులు పాదయాత్రగా తీసుకెళ్తున్నారు. మరో జత విమానంలో బయలుదేరబోతున్నాయని ఫౌండేషన్‌ డైరెక్టర్‌ చల్లా శ్రీనివాస్‌ శాస్త్రి తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రాణం తీసిన బొగ్గుల కుంపటి.. గదిలోనే సమాధి

డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న వాటర్‌ బాటిళ్లు !! 2.4 లక్షల ప్లాస్టిక్‌ రేణువులు

Follow us on