మిస్టరీ మరణాలకు కారణాలేంటి..? తురకపాలెంలో బొడ్రాయికి శాంతిపూజలు..
తురకపాలెంలో అంతుచిక్కని మరణాలకు కారణం ఎవరినీ అడిగినా అందరి చూపు బొడ్రాయి వైపే.. దీన్ని నివారించాలంటే శాంతిపూజలు తప్పవని ఇవాళ పూజలు చేస్తున్నారు గ్రామస్తులు.. రెండు నెలల్లో తురకపాలెం గ్రామంలో ఏకంగా 30 మంది అకారణంగా చనిపోవడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుస్థితికి కారణం బొడ్రాయి అంటున్నారు..
తురకపాలెంలో అంతుచిక్కని మరణాలకు కారణం ఎవరినీ అడిగినా అందరి చూపు బొడ్రాయి వైపే.. దీన్ని నివారించాలంటే శాంతిపూజలు తప్పవని ఇవాళ పూజలు చేస్తున్నారు గ్రామస్తులు.. రెండు నెలల్లో తురకపాలెం గ్రామంలో ఏకంగా 30 మంది అకారణంగా చనిపోవడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుస్థితికి కారణం బొడ్రాయి అంటున్నారు..దీంతో గ్రామంలో భయాందోళనలు తొలగించేందుకు ఒకే తాటిపైకి వచ్చారు గ్రామస్తులు. కులమతాలకు అతీతంగా పూజలకు చేస్తున్నారు. బొడ్రాయిపై తలో బిందె నీళ్లు పోస్తున్నారు. ఇలా చేస్తే శాంతి కలుగుతుందని నమ్ముతున్నారు..
ఇదిలాఉంటే.. మరణాలకు కారణాలేంటో తేల్చడానికి శాస్త్రవేత్తల అధ్యయనం మొదలైంది. బ్యాక్టీరియానే కారణమని చెబుతూ వస్తున్న సైంటిస్టులు… అసలా బ్యాక్టీరియా ఏంటో తేల్చే పనిలో పడ్డారు. ఇక ఇవాళ మృతుల కుటుంబాలతో మాట్లాడనున్నారు NCDC టీమ్. సేకరించిన బ్లడ్ శాంపిల్స్ను ల్యాబ్కి పంపించనున్నారు. పరీక్షల ఫలితాల అనంతరం ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక అందిస్తామంటున్నారు సెంట్రల్ టీమ్ ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్..
తురకపాలెంలో నమోదైన మెలియోయిడోసిస్ జ్వరాలు కలకలం రేపాయి.ఐతే గ్రామస్తులకు భరోసా కల్పిస్తూ ప్రత్తిపాడు MLA బూర్ల రామాంజనేయులు గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేశారు. అలాగే గ్రామస్తుల్లో ధైర్యం నింపేందుకు పల్లె నిద్ర కార్యక్రమం కింద తురకపాలెంలోనే రాత్రి నిద్రించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!

