వరలక్ష్మిపై క్షుద్ర పూజలు చేశారా..!
గాజువాకలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన వరలక్ష్మి హత్య కేసులో మహిళా సంఘాలు కొత్త కోణాన్ని తెరమీదకు తీసుకొచ్చాయి
Gajuwaka Murder Case: గాజువాకలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన వరలక్ష్మి హత్య కేసులో మహిళా సంఘాలు కొత్త కోణాన్ని తెరమీదకు తీసుకొచ్చాయి. ఘటనా స్థలం వద్ద క్షుద్ర పూజలు జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో నిమ్మకాయలు, కోడిగుడ్లు, నల్లటి వస్త్రం, పసుపు, కుంకుమలు ఉండటంతో వారికి అనుమానాలకు బలం చేకూరినట్లు అయ్యింది. ( కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల సజీవ దహనం)
బాలికపై దాడికి పాల్పడిన శనివారం రాత్రి పౌర్ణమి కావడం, బ్లూమూన్ ఉండటం, బాధితురాలి వయస్సు 17 ఏళ్లు కావడంతో ఆమెపై క్షుద్ర పూజలు చేసినట్లు పీఓడబ్ల్యూ, మహిళా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక దాడిపై దాడిపై పోలీసులనే తప్పుదారి పట్టి౦చేలా అఖిల్ కొత్త కథనాన్ని అల్లడం, ని౦దితుడి త౦డ్రే దాడి ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలంప్రేమ దాడిగానే కాకుండా క్షుద్రపూజల కోణంలోనూ లోతైన విచారణ జరపాలని మహిళా సంఘా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ( Bigg Boss 4: మోనాల్కి అభిజిత్ భరోసా)