గ్యాంగ్స్టర్ తలపై భారీ రివార్డు ప్రకటించిన యూపీ పోలీసులు
యూపీ పోలీసులు గ్యాంగ్స్టర్ వికాస్ దుబే తలపై భారీ రివార్డును ప్రకటించారు. దుబేను పట్టిస్తే.. రూ.2.5 లక్షల రివార్డు ఇస్తామని తెలిపారు. ఈ విషయాన్ని యూపీ డీజీపీ ఆఫీస్ ఓ ప్రకటనలో తెలిపింది. గత వారం..
యూపీ పోలీసులు గ్యాంగ్స్టర్ వికాస్ దుబే తలపై భారీ రివార్డును ప్రకటించారు. దుబేను పట్టిస్తే.. రూ.2.5 లక్షల రివార్డు ఇస్తామని తెలిపారు. ఈ విషయాన్ని యూపీ డీజీపీ ఆఫీస్ ఓ ప్రకటనలో తెలిపింది. గత వారం కాన్పూర్లో జరిగిన ఎన్కౌంటర్లో వికాస్ దుబే ప్రధాన నిందితుడు. వికాస్ దుబేను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులుపై దుబే గ్యాంగ్ కాల్పులకు దిగింది. ఈ ఘటనలో ఓ డీఎస్పీతో సహా.. ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుల్స్ మరణించారు. ఈ ఘటన తర్వాత.. పోలీసులు వికాస్ దుబే ఇంటిని, అక్కడ ఉన్న కార్లను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక వికాస్తో సంబంధాలు ఉన్న డిపార్ట్మెంట్కు చెందిన ముగ్గుర్ని సస్పెండ్ చేశారు. అంతేకాదు.. వికాస్ దుబే గ్యాంగ్ను పట్టుకునేందుకు పెద్ద ఎత్తున పోలీస్ టీంలు రంగంలోకి దిగి గాలిస్తున్నాయి. కాగా, కాన్పూర్ ఎన్కౌంటర్లో మరణించిన పోలీసులకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్.
Reward on the head of history sheeter Vikas Dubey increased to Rs 2.5 lakhs: Office of Uttar Pradesh Director General of Police (Earlier picture)
Vikas Dubey, is the main accused in Kanpur encounter case in which 8 police personnel lost their lives. pic.twitter.com/rwkCVex5h3
— ANI UP (@ANINewsUP) July 6, 2020