తిరుమలలో రేపటి నుంచే ఉచిత లడ్డూ…
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు రేపటినుంచి ఉచిత లడ్డూ అందించనున్నారు అధికారులు. స్వామి వారి దర్శనం చేసుకునే ప్రతి భక్తుడుకి ఒక లడ్డూ ఉచితంగా ఇస్తామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఓ అంచనా ప్రకారం రోజుకు దాదాపు 80,000 మంది భక్తులు తిరుమల వెంకన్నను దర్శించుకుంటారు. వారందరికీ కూడా ఉచిత లడ్డూ ఇవ్వనున్నారు. గతంలో కేవలం నడకదారి ద్వారా వచ్చే భక్తులకు మాత్రమే ఈ సదుపాయం ఉండేది. ఇక అదనంగా లడ్డూ కావాలంటే […]
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు రేపటినుంచి ఉచిత లడ్డూ అందించనున్నారు అధికారులు. స్వామి వారి దర్శనం చేసుకునే ప్రతి భక్తుడుకి ఒక లడ్డూ ఉచితంగా ఇస్తామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఓ అంచనా ప్రకారం రోజుకు దాదాపు 80,000 మంది భక్తులు తిరుమల వెంకన్నను దర్శించుకుంటారు. వారందరికీ కూడా ఉచిత లడ్డూ ఇవ్వనున్నారు. గతంలో కేవలం నడకదారి ద్వారా వచ్చే భక్తులకు మాత్రమే ఈ సదుపాయం ఉండేది. ఇక అదనంగా లడ్డూ కావాలంటే ఒక్కో లడ్డూకు రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం తిరుమలలో 12 అదనపు లడ్డూ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా రోజుకు 4 లక్షల లడ్డూలు తయారు చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.