మన జీవితం ఎప్పుడు మన కంట్రోల్ లో ఉండదు.. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మనం ఒక్కటి ఊహించుకుంటే మరోకటి జరుగుతుంది. ఎప్పుడు ఉంటామో పోతామో కూడా చెప్పలేం.. ఇప్పటి వరకు మనతో ఉన్న వారు హఠాత్తుగా ప్రాణులు కొల్పోయిన సందర్భాలు మనం ఎన్నో చూసుంటాం.. అందుకే పెద్దలు చెబుతూ ఉంటారు.. ఈ క్షణాన్ని మాత్రమే ఎంజాయ్ చేయాలంటారు. రేపు అనేదాని గూర్చి అసలు ఆలోచించదంటారు.. పడుకున్నప్పుడు గుండె ఆగిపోవచ్చు లేకపోతే ఏదో పురుగు కరిచి చనిపోవచ్చు, నడుస్తుంటే కిందపడి చనిపోవచ్చు ఇలా ఎప్పుడు ప్రాణాలు పోతాయో కూడా చెప్పలేని జీవితం మనది..
తాజాగా ఓ విషాద ఘటనను చూస్తే మనిషి చావు ఇలా కూడా వస్తుందా అని అనుకుంటాం.. బతుక బండి మీద ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. ఓ విధి వ్యాపారి రోజులానే తన టీవీఎస్ బండిపైన తినుబండారాలు అమ్ముకుంటున్నాడు. అయితే వర్షం వస్తుందని ఓ షాపు ముందు ఆగాడు ఆ వ్యాపారి..వర్షం తగ్గిన తర్వాత పోద్దామని అనుకోగా గుండెలో నొప్పిగా అనిపించింది. దీంతో అతను తన వెంట తెచ్చుకున్న బాటల్ తీసుకొని నీళ్లు తాగాడు. ఆ తర్వాత నొప్పి ఇంకా ఎక్కవైంది. నొప్పి ఇంకా విషమంగా ఉండడంతో గుండె ఆగిపోయింది. రోజు బతుకు లాగించిన బతుకు బండి మీదనే ప్రాణలు వదలడం అందరీన్ని కలిచివేసింది. మొదట అతన్ని చూసిన వారు బండిమీద నిద్రపోతున్నాడని అనుకున్నారు. అటుగా వెళ్తున్నవారికి అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూడగా వ్యక్తి ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు.
ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. మనిషి జీవితం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు ఎవరు ఊహించలేరని కామెంట్లు చేస్తున్నారు. అందుకే మనిషి ప్రతీ నిమిషాన్ని అస్వాదించాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అన్నట్టు ఉంది ఈ వీడియో చాలా బాధాకర సంఘటన 😢 pic.twitter.com/T8PuJVf3Kv
— Do Something For 👉Better Society ✊ (@ChitraR09535143) October 2, 2024